Sunday, September 8, 2024

ఖమ్మం జిల్లా పార్లమెంటు ఎన్నికల బరిలో సోనియా గాంధీ

- Advertisement -

ఖమ్మం జిల్లా పార్లమెంటు ఎన్నికల బరిలో సోనియా గాంధీ

హైదరాబాద్‌:జనవరి 05

కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేసే విషయమై స్పష్టత వచ్చింది. ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర పార్టీ ముఖ్యులకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా లోక్‌సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి, అధిష్ఠానానికి పంపగా, ఆమె సూత్రప్రా యంగా అంగీకరించారు.

ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం కొంత సందిగ్దత కొనసాగింది. తాజాగా ఈ విషయంలోనూ స్పష్టత వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఆమె పోటీ ద్వారా ఇటు తెలంగాణలోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సోనియాగాంధీ నాయక త్వంలోని యూపీఏ ప్రభు త్వం 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ నేత లు విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్లారు.

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకట నకు ముందు సెప్టెంబరు 17న తుక్కుగూడలో విజయభేరి పేరుతో జరిగిన భారీ బహిరంగ సభలో సోనియాగాంధీ పాల్గొన్నా రు. సోనియా హాజరైన తుక్కుగూడ సభ తర్వాతే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్‌ నేతలు బలంగా తీసుకువెళ్ల గలిగారు.

ఈ నేపథ్యంలోనే సోనియా బ్రాండ్‌ను లోక్‌సభ ఎన్నిక ల్లోనూ గట్టిగా ఉపయోగిం చాలన్న చర్చ రాష్ట్ర పార్టీలో వచ్చింది. అందులో భాగం గానే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే సోనియా రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతూ తీర్మానం చేసి అధిష్ఠానానికి పంపారు.

తాజాగా బుధవారం జరిగిన టీపీసీసీ సమావేశంలోనూ ఈ అంశంపై మరోసారి చర్చ జరిగింది. అందులో భాగం గానే సోనియాగాంధీ తెలం గాణ నుంచి పోటీ చేయాల ని మరోసారి తీర్మానం చేశారు. రెండోసారి తీర్మానం తర్వాత సోనియా కార్యాల యం నుంచి రాష్ట్ర నేతలకు సానుకూల సందేశం అంది నట్లు తెలిసింది.

రాష్ట్రం నుంచి పోటీ చేయ డానికి ఆమె అంగీకరించా రని, అందుకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొం దించాలని సూచించారని సమాచారం. ఢిల్లీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో సోనియా పోటీకి సంబం ధించిన ఏర్పాట్లపై రాష్ట్ర నేతలు దృష్టి సారించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్