జగిత్యాల లో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించండి
ఎంపీ అర్వింద్
కేంద్ర మంత్రి జయశంకర్ కి లేఖ
జగిత్యాల
జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అర్వింద్ బుధవారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కి లేఖ రాశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి కి తెలియజేశారు. జగిత్యాల జిల్లా కేంద్రం తోపాటు పరిసర ప్రాంతాల్లో గణనీయమైనటువంటి జనాభా ఉందని, వారు ఉపాధి, ఉన్నత చదువులు, ఇతర ప్రయోజనాల కొరకు తరచుగా గల్ఫ్ దేశాలకు వెళ్తారని, ఇక్కడ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం లేకపోవడంతో నిజామాబాద్ లేదా కరీంనగర్ కి వెళ్లి సేవలు వినియోగించు
కుంటున్నారని, దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఎంపీ వ్రాసిన లేఖలో ప్రస్తావించారు. పాస్ పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే జగిత్యాల పరిసర ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉండడమే గాక, ప్రభుత్వం అందిస్తున్నటువంటి కీలక సేవలు మరింత అందుబాటులో ఉంటాయని ఆయన లేఖలో వివరించారు. తమ విజ్ఞప్తికి మంత్రి దృష్టికి తీసుకెళ్లి, జగిత్యాల జిల్లాలో పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు చొరవ చూపిన ఎంపీ అర్వింద్ కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు…


