మమునూరు ఎయిర్ పోర్ట్ కోసం 300 ఎకరాల భూమిని అందించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్
State government provides 300 acres of land for Mamunur Airport
వరంగల్ మమునూర్ విమానాశ్రయ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 300 ఎకరాల భూమిని అందించింది.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భూమి పత్రాలు అందించిందారు. రెండున్నర సంవత్సరాల్లో విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాసనమండలి వైస్ చైర్మన్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్, ఎంపీ కడియం కావ్య మరియు ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు పాల్గోన్నారు.



