- Advertisement -
ఎల్బీనగర్, వాయిస్ టుడే: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి గురువారం ఉదయం దిల్ సుఖ్ నగర్ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బి.ఎన్.రెడ్డినగర్ డివిజన్ మారుతినగర్ లోని ఎస్.ఎస్.ఎస్.విద్యానికేతన్ స్కూల్ లో పోలింగ్ బూతులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుధీర్ రెడ్డితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఆయన సతీమణి కమలా సుధీర్ రెడ్డి, వారి కుమారులు ప్రీతమ్ రెడ్డి, గౌతమ్ రెడ్డి ఉన్నారు.
- Advertisement -


