తెలంగాణలో బుధవారం నుంచి ఎండకాలం సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. ఈ ఎండకాలం సెలవులు 49 రోజులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.
జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సమ్మర్ హాలీడేస్ లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించనుంది. పాఠశాలల్లో మూత్రశాలలు, విద్యుత్, బెంచీలు ఏర్పాటు చేయనుంది.
పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.1100 కోట్లు కేటాయించింది. జూన్ 11 వరకు ఈ నిధులతో స్కూలల్లో అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటికే ఇంటర్ విద్యార్థలకు సెలవులు కొనసాగుతోన్నాయి. ఇంటరు విద్యార్థులకు మార్చి 30 నుంచి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 31 వరకు ఇంటర్ విద్యార్థలకు సెలవులు ఉన్నాయి.
జూన్ 1న ఇంటర్ కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. బుధవారమే ఇంటర్ ఫలితాలు ప్రకటించనున్నారు. హైదరాబాద్ లోని ఇంటర్ బోర్డు ఆఫీస్ లో ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యా శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ఫలితాలను ప్రకటిస్తారు. ఇక 10 వ తరగతి ఫలితాలను ఏప్రిల్ 30 తేదీన ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.