లోక్ సభలో టీయర్ గ్యాస్

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు న్యూఢిల్లీ: లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన నిందితులు  నీలం కౌర్, అమోల్ షిండేగా పోలీసులు గుర్తించారు.  షూస్లో టియర్ గ్యాస్ షెల్స్ పెట్టుకెళ్లి సభలో విసిరారు.  నియంతృత్వం ఇక చెల్లదు. అంటూ నినాదాలు చేసారు. అప్రమత్తమయిన  భద్రతా సిబ్బంది  ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. 2001లో ఇదే రోజు పార్లమెంట్పై ఉగ్ర దాడి జరిగింది. తాజా ఘటనతో ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి…