Wednesday, March 26, 2025

రాజ్యంగ విలువలకు అనుగుణంగా తెలంగాణ శాసనసభ

- Advertisement -

రాజ్యంగ విలువలకు అనుగుణంగా తెలంగాణ శాసనసభ

Telangana Legislature in accordance with the values ​​of Rajyanga

పాట్నా
పాట్నాలో  జరుగుతున్న 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ (AIPOC) లో తెలంగాణ శాసన సభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్,  శాసనమండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి,  డిప్యూటీ చైర్మన్  బండా ప్రకాష్ ముదిరాజ్, మరియు లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, అధికారులు పాల్గోన్నారు
సభలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ రాజ్యాంగ ఆవిర్భావం జరిగి 75 వసంతాలు అయిన సందర్భంగా రాజ్యాంగ విలువల బలోపేతానికి పార్లమెంట్, శాసనసభల తోడ్పాటు అంశంపై మాట్లాడారు.
భారత రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంట్ రూపొందించిన చట్టాలు దేశంలో ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడుతున్నాయి. తద్వారా దేశ ప్రజల హక్కులు రక్షించబడుతున్నాయి.  ముఖ్యంగా సమాచార హక్కు చట్టం, వస్తు సేవల పన్ను లతో పాటుగా విద్య, వైద్యం, సామాజిక న్యాయం వంటి అంశాలలో పార్లమెంట్ రూపొందించిన చట్టాలు ఈ దేశ పౌరులకు ఉపయోగపడుతున్నాయి.
ప్రజాస్వామ్యం, సమన్యాయం, సమానత్వం లు ప్రాధమిక అంశాలుగా రూపొందించిన భారతదేశ రాజ్యాంగం గత డెబ్బై అయిదు సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలకు మార్గదర్శనం చేస్తున్నదని అన్నారు.
భారత రాజ్యాంగ విలువలకు, మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ శాసనసభ పనిచేస్తుంది. తెలంగాణ ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనలో, వాటిని చట్టాలుగా ఆమోదించడంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఒక మోడల్ గా ఉన్నది.
మెజారిటీ ప్రజలకు సంబంధించిన  వ్యవసాయం, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు, సామాజిక పథకాలు, మౌళిక వసతుల కల్పన వంటి కీలక అంశాలకు తెలంగాణ శాసనసభ ప్రాముఖ్యత ఇచ్చిందని అన్నారు.
ముఖ్యంగా రైతుల భూ వివరాలకు ఉపయోగపడే భూ భారతి చట్టం, యువతకు సంబంధించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి చట్టాల రూపకల్పన ద్వారా తెలంగాణ శాసనసభ మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నదని సగర్వంగా చెప్పగలను.రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్న రైతుల ప్రయోజనం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వం లోని ప్రభుత్వం అధిక నిధులను కేటాయిస్తుంది. రైతు భరోసా పెంపు, రైతు భీమా అమలు ద్వారా రైతాంగానికి అండగా ఉన్నది. ప్రభుత్వ గురుకుల, ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోని ప్రభుత్వం మెస్ చార్జీలను భారీగా పెంచింది. విద్యార్థులకు అందుతున్న సేవలను పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు,  ఉన్నతాధికారులు తరుచుగా గురుకుల పాఠశాలను తనిఖీ చేస్తున్నారు. మహిళలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంది. ప్రభుత్వ బస్సులలో చిరు ఉద్యోగ, వ్యాపారాలు చేసే మహిళలు మరియు విద్యార్ధినులకు ఉచిత ప్రయాణంతో ఆర్దిక భారం తగ్గింది. రూ. 500 లకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ తో మహిళలకు గృహ నిర్వాహణ సులభమైంది. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా నడుచుకుంటూ తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే చట్టాల రూపకల్పనకు కృషి చేస్తున్న తెలంగాణ శాసనసభ్యులను అభినందిస్తున్నాను.
మనమందరం రాజ్యాంగ విలువలను పాటిస్తూ ఇదే విధమైన స్పూర్తిని కొనసాగిస్తూ ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నానని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్