కాట శ్రీనివాస్ గౌడ్
వాయిస్ టుడే న్యూస్ పటాన్ చెరు: అధికార బీఆర్ఎస్ పార్టీకి అసమ్మతి నేతలు ఝలక్ ఇస్తున్నారు. రోజురోజుకు కాంగ్రెస్ లో చేరికల సంఖ్య పెరుగుతుంది పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామం బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ అశోక్ వారి బృందం 200 మంది ఆ పార్టీని వీడి కాట శ్రీనివాస్ గౌడ్ సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కుటుంబం మాత్రమే అన్ని రకాలుగా లబ్ది పొందిందని తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదని అన్నారు. రాష్ట్ర ప్రజానికమంతా మీరు చెప్పే మాయమాటలు నమ్మి మరోసారి మోసపోరని మార్పు మొదలైంది రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. మీ పాలనపై విరక్తి చెంది అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ కార్డులతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని కమిషన్లు దండుకోవడం తప్ప మరొకటి చేయలేదని అన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి పతనం ఖాయమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్ని వర్గాల ప్రజలకు సమాన అభివృద్ధి లభిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మండల్ ప్రెసిడెంట్స్ వడ్డె క్రిష్ణ, నర్సింగ్ రావు, ఎంపీపీ రవీందర్ గౌడ్, ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్, ఉప అధ్యక్షుడు రాజు గౌడ్, లక్ష్మణ్, మున్సిపాలిటీ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీలు సత్యనారాయణ, లక్ష్మరెడ్డి, ఉప సర్పంచులు రవి, రమేష్, అసెంబ్లీ ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ మహేష్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, రాజి రెడ్డి, జయశంకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా nsui వైస్ ప్రెసిడెంట్ సాయి, జిన్నారం యూత్ ప్రెసిడెంట్ నరేందర్, గ్రామ అధ్యక్షుడు అర్జున్, సత్యనారాయణ, ఉప అధ్యక్షుడు నాగరాజు, యూత్ ప్రెసిడెంట్ కుమార్, చంద్రయ్య, క్రిష్ణ మోహన్, అర్జున్, సత్తయ్య, వినయ్, మధు, శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకలు, కార్యకర్తలు, కె ఎస్ జి యువసేన సభ్యులు పాల్గొన్నారు.



