Friday, June 20, 2025

గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసిన సీఎం

- Advertisement -

గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి..
హైదరాబాద్

The CM met Governor CP Radhakrishnan

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన ముందుగా గవర్నర్ను శాలువాతో సన్మానించారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు. ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేస్తున్న సీపీ రాధాకృష్ణన్‌ ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన్ను తాజాగా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. అందులో భాగంగా రాధాకృష్ణన్‌ను స్థానంలో జిష్ణుదేవ్‌ వర్మను తెలంగాణ గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. త్రిపురకు చెందిన జిష్ణుదేవ్ వర్మ 66, రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. 1957 ఆగస్టు 15న జన్మించిన ఆయన 2018-2023 మధ్య త్రిపుర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్