క్యూకాంప్లెక్స్ ను పరిశీలించిన కార్యనిర్వాహణాధికారి
The Executive Officer inspected Q Complex
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేయనున్న క్యూలైన్లను పరిశీలించిన కార్యనిర్వహణాధికారి
శ్రీశైలం
భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్సవాలకు వివిధ విస్తృత ఏర్పాట్లు చేయబడుతున్నాయి.ఇందులో భాగంగా శనివారం రోజు కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో కలసి క్యూలైన్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ ఈ సంవత్సరం శీఘ్రదర్శనం మరియు అతిశీఘ్రదర్శనం టికెట్ల కౌంటర్లను వేరువేరుచోట్ల ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏర్పాటువలన కౌంటర్ల వద్ద క్యూలైన్లు సజావుగా నిర్వహించవచ్చునని అన్నారు.ప్రస్తుత శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం టికెట్లు ఇచ్చే కౌంటర్లను (విరాళాల సేకరణ కౌంటర్ ప్రక్కన గల కౌంటర్లు) అతిశీఘ్రదర్శనం (రూ. 500/-ల టికెట్టు) కౌంటర్లుగా వినియోగించాలన్నారు.ఇక శీఘ్రదర్శనానికి (రూ. 200/-ల టికెటు) క్యాంటిన్ భవనం తొలగించిన ప్రదేశంలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.గత సంవత్సరం మాదిరే ఉచిత దర్శనం క్యూలైన్లను రథశాల నుంచి ప్రారంభించాలన్నారు. ఈ సంవత్సరం అదనపు క్యూలైన్లు కూడా ఏర్పాటు చేయాలన్నారు.వృద్ధులకు, దివ్యాంగులకు మరియు చంటిబిడ్డ తల్లులకు ప్రత్యేక క్యూలైన్లు ఉండాలన్నారు. ఈ ప్రత్యేక క్యూలైనును ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం ముందుభాగం నుంచి ఏర్పాటు చేయాలన్నారు.భక్తుల సౌకర్యార్థమై విరాళాల సేకరణ వద్ద చక్రాల కుర్చీలను (వీల్వైర్) తగిన సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలన్నారు.క్యూలైన్లలో తొక్కిసలాట లేకుండా ఉండేందుకుగాను తగినస్థాయిలో సెక్యూరిటీ సిబ్బందిని మరియు శివసేవకులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయములో నిర్దిష్టమైన ప్రణాళికలను రూపొందించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు.అదేవిధంగా వెడల్పుగా ఉన్న క్యూలైన్ల మధ్యలో రోడ్లైన్లను అనగా తాళ్ళతో తాత్కాలిక లైన్లను కూడా. ఏర్పాటు చేయాలన్నారు.క్యూలైన్లలో అవాంఛనీయ సంఘటనలు నిరోధించేందుకు మరియు అత్యవసర సమయాలలో వినియోగించుకునేందుకు క్యూలైన్లలో ఏర్పాటు చేయబడిన అత్యవసర గేట్లు (ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లు) సజావుగా పనిచేసేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ అత్యవసర లైన్లను సులభంగా గుర్తించేందుకు వీలుగా వాటికి ప్రత్యేకంగా ఎర్రరంగును వేయాలన్నారు.క్యూకాంప్లెక్స్ లోనూ నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు మొదలైనవాటిని అందజేస్తుండాలన్నారు.క్యూకాంప్



