ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాద ఘటనలో బోట్లు నష్టపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున 49 మందికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెక్కులు పంపిణీ చేశారు. తాను ఇచ్చే డబ్బు కష్టాలు, తీరుస్తుందని తాను నమ్మనని, కష్టాలు వస్తే జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నాడనే బావన, కష్టాల్లో బతకనిస్తుందని పవన్ చెప్పారు. మత్స్యకారులను తాను ఏ రోజు ఓటు బ్యాంక్తో ఆలోచించలేదు.. కష్టాల్లో తమ వెంట నిలబడతానని చెప్పడం కోసం వచ్చానని తెలిపారు. సుమారుగా 25 కోట్ల మేర నష్టం జరిగిందని, పరిమితి వలన న్యాయం చేయలేకపోతున్నానని, ప్రతి మత్స్యకారుడికీ అండగా ఉంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఖండ బలం, గుండె బలం ఉండాలో మత్స్యకారుని చూసే నేర్చుకోవాలన్నారు. గత కొంతకాలంగా చీకటి గ్యాంగ్స్ ఎక్కువయ్యాయని, మత్స్యకారులను భయపెడుతున్నారని విమర్శించారు.




