Sunday, September 8, 2024

కరీంనగర్లోని సినిమా కళాకారులు చిత్రరంగంలో రాణించాలి.బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, బండి సంజయ్ కుమార్ .

- Advertisement -

—-కరీంనగర్లోని సినిమా కళాకారులు చిత్రరంగంలో రాణించాలి.

—-పైలం పిలగా మూవీ యూనిట్ కు అభినందనలు..

—-పైలం పిలగా సినిమా పాటల విడుదల సందర్భంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, బండి సంజయ్ కుమార్ .

కరీంనగర్ ఏప్రిల్ 21(వాయిస్ టుడే )హనుమాన్ జయంతి సందర్భంగా పైలం పిలగా సినిమా యూనిట్ చిత్రంలోని హనుమాన్ అనంతం జై చిరంజీవ పాటను ఆదివారం కరీంనగర్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని యువత, సినీ కళాకారులందరూ తెలుగు సినిమా రంగంలో రాణించాలని ఆకాంక్షించారు.తెలంగాణ యాస భాష  సంస్కృతి తెలుగు సినిమా కి ట్రెండ్ గా మారిందని,ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ సినిమా రంగం లో తమ సత్తా చాటాలన్నారు. ‘పైలం పిలగా ‘ సినిమా వంద శాతం పూర్తిగా కరీంనగర్ లోనే షూటింగ్ జరుపుకోవడం , ఈ సినిమా నిర్మాత, దర్శకుడు, హీరో కరీంనగర్ వాసులే కావడం సంతోషకర విషయమన్నారు.హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ నిర్మాణంలో రామకృష్ణ బొద్దుల, ఎస్.కె . శ్రీనివాస్ నిర్మాతలు గా ,ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించిన పైలం పిలగా చిత్రం పెద్ద సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. మూవీ యూనిట్ కు, చిత్రంలో పనిచేసిన నటీనటులందరికీ బండి సంజయ్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ పైలం పిల్లగా మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. హాస్య భరిత వ్యంగ చిత్రంగా పైలం పిలగా అతి త్వరలో రిలీజ్ కానుందన్నారు. మూవీలో వెబ్ సిరీస్ ఫేమ్ సాయి తేజ హీరో గా, పరేషాన్  ఫేమ్ పావని కారణం హీరోయిన్ గా నటించారని, ఇంకా ఈ చిత్రంలో డబ్బింగ్  జానకి, చిత్రం శ్రీను, మిర్చి కిరణ్ తదితరులు నటించారన్నారు. యశ్వంత్ నాగ్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం లో ఆరు పాటలను రామ్ మిర్యాల, చిత్ర, శ్రావణ భార్గవి ఆలపించారని, కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ కూర్మన, స్టైలిష్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జుక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నలా , సహా నిర్మాతలు గా కృష్ణమసునూరి, రవి వాషింగ్టన్, విజయ్ గోపు వ్యవహరించారని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్