Saturday, March 14, 2026

ఉచిత ప్రయాణం ఎఫెక్ట్  దేవాలయాలలో మహిళల సందడి

- Advertisement -

ఉచిత ప్రయాణం ఎఫెక్ట్
 దేవాలయాలలో మహిళల సందడి

హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్‌తో ఉమ్మడి జిల్లాలో ప్రయా ణికుల సంఖ్య రెట్టింప య్యింది. యాదగిరిగుట్టతో పాటు పలు క్షేత్రాలకు మహిళ భక్తుల తాకిడి భారీగా పెరిగింది.

పర్యాటక ప్రాంతాలకూ జనం పోటెత్తుతున్నారు. ఆర్టీసీ మాత్రం ప్యాసింజర్ల రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపడంలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచాలని ప్యాసింజర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి తీసుకొచ్చింది.

పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఆధార్‌ కార్డుతో పాటు పలు గుర్తింపు కార్డులను చూపిస్తూ ఉచితంగా రవాణా చేస్తున్నారు. దాంతో ఒక్కసారిగా జిల్లాలో ప్రయాణికుల తాకిడి పెరిగింది.

మహిళలు పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నారు. స్థానికంగా ఉన్న మహిళలంతా ఒక టీముగా ఏర్పడి ఆలయా లకు క్యూ కడుతున్నారు. రెండో తిరుపతిగా ప్రసిద్ధి పొందిన దివ్య క్షేత్రం యాదగిరి గుట్టను అద్భుతంగా తీర్చిదిద్దడంతో స్వామి వారిని దర్శించేం దుకు తండోపతండాలుగా మహిళ భక్తులు తరలివస్తున్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు. యాదగిరి గుట్టతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడు తున్నాయి.

ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నా జిల్లాకు ఎన్ని వస్తాయో చూడాలి మరీ. రద్దీ కారణంగా పురుషులు పిల్లలు, వృద్ధులు బస్సుల్లో నిల్చొని ప్రయాణించక తప్పడం లేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్