Thursday, March 12, 2026

‘ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్’ అక్టోబర్ 2న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్  

- Advertisement -

శ్రద్ధా శ్రీనాథ్ , రాజేష్ ఎం. సెల్వా గ్రిప్పింగ్ థ్రిల్లర్ ‘ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్’ అక్టోబర్ 2న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్  

The Game: You Never Play Alone’ releases on Netflix on October 2

శ్రద్ధా శ్రీనాథ్  లీడ్ రోల్ లో నెట్‌ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలసి చేస్తున్న న్యూ థ్రిల్లర్ “ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్” అక్టోబర్ 2న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది.  బ్లాక్ వారంట్ తర్వాత   నెట్‌ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని రాజేష్ ఎం. సెల్వా డైరెక్ట్ చేస్తున్నారు.
లీడ్ రోల్‌లో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుండగా, సంతోష్ ప్రతాప్, చందినీ, శ్యామ హరిని, బాల హసన్, సుబాష్ సెల్వం, వివియా సంతోష్, ధీరజ్, హెమా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. స్ట్రాంగ్ స్టోరీటెల్లింగ్‌తో పాటు టైమ్‌లి థీమ్స్‌ని మిక్స్ చేస్తూ ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది
నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ.. “ది గేమ్ మా ఈ ఏడాది ఫస్ట్ తమిళ సిరీస్. సరికొత్త స్టోరీని తీసుకొస్తున్నాం. ఒక ఫీమేల్ గేమ్ డెవలపర్‌పై జరిగే కోఆర్డినేటెడ్ అటాక్ వెనక వాళ్లను ట్రాక్ చేసే ఆమె జర్నీని ఈ థ్రిల్లర్ గా ప్రజెంట్ చేస్తునాం. అప్లాజ్ తో మా కలయికలో ఇప్పటికే బ్లాక్ వారంట్ వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్ కూడా చాలా రెలివెంట్‌గా ఉంటుంది.
అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎండీ సమీర్ నాయర్ మాట్లాడుతూ.. “ది గేమ్ అనేది డిజిటల్ యుగం రియాలిటీలను చూపించే టైమ్‌లి స్టోరీ. రాజేష్ సెల్వా స్టైల్‌తో స్ట్రాంగ్ స్టోరీటెల్లింగ్ తో ఆడియన్స్‌కి చాలా కనెక్ట్ అవుతుంది.
డైరెక్టర్ రాజేష్ ఎం. సెల్వా మాట్లాడుతూ..  ది గేమ్ కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు, మనం ఉన్న రియల్ వరల్డ్‌కి అద్దం పడుతుంది. ఇది పీపుల్, వాళ్ల ఛాయిస్‌లు, బలహీనతలు, నిజం – అబద్ధం మధ్య సన్నని లైన్‌ గురించిన కథ. నెట్‌ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్   కలయిక వలన మాకు క్రియేటివ్‌గా కొత్త ఎక్స్‌పెరిమెంట్స్ చేసే లిబర్టీ దొరికింది
థ్రిల్లర్ సస్పెన్స్‌తో పాటు, ఫ్యామిలీ కాంఫ్లిక్ట్ కి సంబంధించిన ఎమోషన్స్‌ని కూడా కలిపి చూపించే ఈ సిరీస్ ఆడియన్స్‌కి సరికొత్త అనుభూతిని అందించబోతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్