Tuesday, April 21, 2026

దేశ అత్యున్న న్యాయ స్ధానం చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది…: పురందేశ్వరి

- Advertisement -

విజయవాడ..:  దేశ అత్యున్నత న్యాయస్ధానం  చారిత్రాత్మక తీర్పు నిచ్చిందని బిజెపి  రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. 370 అధికరణను పార్లమెంట్  లో రద్దు చేయడం జరిగింది. ఈ రోజు  దేశ అత్యున్నత న్యాయ స్ధానం 370  అధికరణను  రద్దు పరచడాన్ని సమర్ధిస్తూ తీర్పు నిచ్చింది.   ఈ రోజు చారిత్రాత్మక రోజుగా  దేశ ప్రజలు భావించాలి. ద్వంద ప్రమాణాలకు బిజెపి వ్యతిరేకం  ఒక దేశానికి ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ చిత్రాలు, రెండు జెండాలు వంటి వాటిని  బిజెపి  ఆది నుండి వ్యతిరేకిస్తున్న విషయం అందరికీ తెలుసు.  జమ్మూ కాశ్మీర్  దేశం లో అంతర్భాగం కాదని  భావించిన తరుణంలో 370 అధికరణ రద్దు చేయడం ద్వారా కాశ్మీర్  దేశ అంతర్భాగం అనే నమ్మకం కలిగింది.  370  అధికరణకు అభ్యంతరం తెలుపుతూ  బిజెపి  వ్యవస్ధాపనకు  మూల కారకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ వెళ్లినప్పడు  ఆయనను అరెస్టు  ఆయన ఆనుమానస్పద రీతిలో  మృతి చెందడం వంటి సంఘటనలు  దేశ ప్రజలు మరువలేదు.  నేడు  సుప్రీం తీర్పు దేశ ప్రజలు  పూర్తిగా స్వాగతిస్తున్నారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్