అంగన్వాడి వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలి
తహాసిల్దార్,ఎంపీడీవోకు వినతి పత్రాన్ని అందజేసిన అంగన్వాడి వర్కర్స్.
తుగ్గలి
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. గురువారం రోజున మండల కేంద్రమైన తుగ్గలిలో తుగ్గలి తహాసిల్దార్ రవి కు,ఎంపీడీవో సావిత్రి కు అంగన్వాడి వర్కర్స్ వినతి పత్రాన్ని అందజేసి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలియజేశారు.గత 24 రోజుల నుండి అంగన్వాడీలు సమ్మె బాటలో ఉన్న కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు తెలియజేశారు.పెరిగిన నిత్యవసర ధరలు, తదితర ఖర్చులతో కుటుంబ పోషణ భారం అవుతుందని వారు తెలియజేశారు.కావున అధికారులందరూ అంగన్వాడీల సమ్మెకు సహకరించి అంగన్వాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్లు,ఆయా లు తదితరులు పాల్గొన్నారు



