Tuesday, January 27, 2026

బడుగు బలహీన వర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

- Advertisement -

శ్రీధర్ బాబు తోనే మంథని నియోజక వర్గ అభివృద్ధి                     

అధికారంలోకి రాగానే కుల గణన చేస్తాం

బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతాం        

విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఓబిసి సెల్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ పి వినోద్ కుమార్,  టిపిసిసి అధికార ప్రతినిధి కొనగల మహేష్     

మంథని:  బడుగు బలహీన వర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఓబీసీ సెల్  మాజీ వైస్ చైర్మన్, డాక్టర్ పి వినయ్ కుమార్, టిపిసిసి అధికార ప్రతినిధి కొనగల మహేష్  లు అన్నారు.  మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ   కాంగ్రెస్ పార్టీ  మేనిఫెస్టోలో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని కామారెడ్డి సభలో  ప్రకటించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపడుతామని  స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 శాతం నుండి  కు 42 శాతానికి పెంచుతామన్నారు. మంథని చరిత్ర గురించి దశాదిశలు తెలిసేలా పివి నరసింహారావు, దుద్దిల్ల శ్రీపాదరావు చేశారని, దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్న సమయంలో మంథని నియోజక వర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని.. వారి పాలనలో మంథని ప్రశాంత వాతావరణం ఉండేదన్నారు.

బిసి బిడ్డ అని చెప్పుకునే పుట్ట మధు బీసీల కోసం చేసింది ఏమీ లేదని, పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎప్పుడు కూడా బీసీల సమస్యలపై మాట్లాడిన చరిత్ర లేదని కేవలం ఓట్ల కోసమే బీసీ బహుజన వాదాన్ని పుట్ట మధు ఎత్తుకున్నాడని వారు ఆరోపించారు.కానీ నేడు మంథని  మినీ బీహార్ గా మారిందన్నారు. మంథనిలో ప్రశాంత వాతావరణం నెలకొనాలన్న మంథని నియోజక వర్గం అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నా మంథని నియోజకవర్గం ప్రజలు చేతి గుర్తుకు ఓటు వేసి శ్రీధర్ బాబును అత్యధిక మెజారిటీతో మంథని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శశి భూషణ్ కాచే,మంథని ఎంపీపీ కొండ శంకర్, ఊదరి శంకర్, మూల పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్