అంబర్ పేట;- అక్టోబర్ 7!( వాయిస్ టూ డే): ఆమ్ ఆద్మీ పార్టీకి దేశవ్యాప్తంగా ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి బిజెపి ఓర్వలేకపోతున్నదని దానిలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులపై సిబిఐ ఈడి లాంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రొఫెషనల్ వింగ్ కన్వీనర్ డాక్టర్ హరి చరణ్ ఆరోపించారు….
అంబర్పేట నియోజకవర్గం పరిధిలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ హరి చరణ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా డాక్టర్ హరి చరణ్ మాట్లాడుతూ స్వయం ప్రతిపత్తి కలిగిన సిబిఐ ఈడి లాంటి దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకొని బిజెపి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి దేశవ్యాప్తంగా ప్రజల్లో పెరుగుతున్న ఆదరణని బిజెపి చూసి ఓర్వలేకపోతుందని దానిలో భాగంగానే కుట్రపూరితంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేస్తుందని ఆరోపించారు.. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ గారిని ఢిల్లీ పాత లిక్కర్ కేసుకు సంబంధించి అరెస్టు చేసి ఐదు రోజుల కస్టడీకి ఇవ్వడం అనేది కుట్రలో భాగంగానే జరుగుతుందని బిజెపి పార్టీ ప్రతిపక్షాలను శత్రువులుగా భావించి అరగదొక్కాలనుకోవడం భావ్యం కాదని బిజెపి ఇకనైనా తన తీరు మార్చుకోవాలని డాక్టర్ హరి చరణ్ హితవు పలికారు…
ఈ సమావేశంలో కోర్ కమిటీ మెంబర్స్ డాక్టర్ పుట్ట పాండురంగయ్య, మొహమ్మద్ మరియు ప్రవీణ్ యాదవ్ ,సూర్య, విజయ్, మల్లంగి, సలావుద్దీన్, మహమూద్ అలీ, శివశంకర్ యాదవ్, రాకేష్ ,శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ ,రాజేందర్, మన్మోహన్ ,ఆకుల సత్యనారాయణ, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.