ఆ ఇంట్లో కండోమ్స్ ఫ్యాక్టరీయే ఉందే
వరంగల్, మార్చి 22, (వాయిస్ టుడే )
There's a condom factory in that house.
వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక కిడ్నాప్ కేసును మిల్స్ కాలనీ పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన వారిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 11వ తేదీ వరంగల్ లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మైనర్ బాలిక మిస్సింగ్ అయిందని ఫిర్యాదు వచ్చింది. పోలీసులు తక్షణమే విచారణ ప్రారంభించారు. అయితే వారు ఆమెని ములుగు క్రాస్ రోడ్డు వద్ద గుర్తించారు. ఆమెని విచారించగా.. ఆమె చెప్పిన దారుణం అనుకున్నదానికి మించి ఉంది. బాధిత బాలిక చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. తనను కొంతమంది యువకులు కిడ్నాప్ చేసి గంజాయి తాగించి, అత్యాచారం చేశారని చెప్పింది.డీసీపీ సన్ ప్రీత్ సింగ్, సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో.. వరంగల్ ఏసీపీ పర్యవేక్షణలో మూడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించి.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకి సంబంధించి ప్రధాన నిందితురాలు ములుగు జిల్లా దామెర మండలానికి చెందిన పడుపు వృత్తి చేసే మస్కులతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమె దగ్గర మరో మైనర్ నిందితురాలిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మైనర్ నిందితురాలి సాయంతో ఆమె బాలికను కిడ్నాప్ చేయించిందని పోలీసులు తెలిపారు.ఈ కిడ్నాప్లో మైనర్ బాలిక బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ అఫ్సాన్ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అబ్దుల్ అఫ్సాన్ సాయంతోనే బాలికకు గంజాయి తాగించి.. తమ ట్రాప్లో పడేలా చేశాడని పోలీసులు తెలిపారు. గంజాయితో పాటు.. స్నేహితులతో కలిసి అత్యాచారం కూడా చేశారని మైనర్ బాలిక తెలిపింది. ఆ సమయంలో వీడియో కూడా రికార్డ్ చేసినట్లు తెలిపింది. ఎవరికైనా చెబితే.. వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. బాలిక ఫిర్యాదు మేరకు అబ్దుల్ అఫ్సాన్, అతడి స్నేహితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.