ఎమ్మెల్యే అజాగ్రత్తతోనే కూలిన గార్డర్లు
-ఆనాడే చర్యలు తీసుకుంటే ఇలా జరిగేది కాదు
-మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని
ఎంపీ ఎలక్షన్ సమయంలో ముత్తారం మండలం ఓడేడ్ మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి మూడు గార్డర్లు గాలికి కూలిపోతే పరిశీలించిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు తగిన చర్యలు తీసుకోకుండా అజాగ్రత్తగా వ్యవహరించడం మూలంగానే ఈనాడు మళ్లీ ఐదు గార్డర్లు కూలిపోయాయని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. శుక్రవారం ఓడేడ్ బ్రిడ్జి కూలిన గార్డర్లను ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆనాడు కూలిన గార్డర్లను పరిశీలించిన ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణంలో అవినీతి జరిగిందని, మొత్తం బయటకు తీస్తానంటూ మాట్లాడాడని, మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదన్నారు.ఆనాడే మూడు గార్డర్లు కూలిపోతే మిగితావి ఎలా ఉన్నాయని, వాటి పరిస్థితి ఏంటని పరిశీలన చేసి తదుపరి చర్యలు తీసుకుంటే ఈనాడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.50కోట్ల నిధులు తీసుకువచ్చామని, అయితే త్రీ పర్సంట్ లెస్తో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ అలసత్వం వల్ల మధ్యలోనే పనులు ఆగిపోయాయని అన్నారు. అయితే అటు తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్బాబు ఓడేడ్ బ్రిడ్జి గురించి ఆలోచన చేయలేదని, కనీసం పర్యవేక్షన చేయలేదన్నారు. ఓట్లపై ఉన్నశ్రద్ద ప్రజాసమస్యలపై లేని ఎమ్మెల్యే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారని,మంత్రి అయ్యాక దోపిడి పెరిగిందన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో వచ్చి ఓడేడ్ బ్రిడ్జి కూలిన గార్డర్లను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటే ఈనాడు ఈ విపత్తు జరిగేది కాదని, ఇందుకు నైతిక బాధ్యత ఎమ్మెల్యే వహించాలన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెద్దంపేట, మోదుడు ప్రజల కష్టాలను గుర్తించి బ్రిడ్జి నిర్మాణాలు చేశామని, గత తండ్రి కొడుకుల పాలనలో నియోజకవర్గంలో ఒక్కబ్రిడ్జినిర్మించలేదని, పీవీ నర్సింహరావు తర్వాత తానే ఈ ప్రాంతంలో బ్రిడ్జిలు నిర్మించిన చరిత్ర ఉందన్నారు. తనలాంటి బీసీ బిడ్డకు అధికారం వస్తే ఎలా ప్రజలకు దూరం చేయాలనే ఆలోచనలు తప్పప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఎమ్మెల్యే కుటుంబం ఏనాడు చేయలేదని ఆయన ఈ సందర్బంగా విమర్శించారు.
ఆనాడే చర్యలు తీసుకుంటే ఇలా జరిగేది కాదు

- Advertisement -
- Advertisement -