- Advertisement -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల నిరసన
Trade unions protest against steel plant privatisationవిశాఖపట్నం
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కార్మిక సంఘాలు నిరసనకు దిగాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి వామపక్ష నేతలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే ప్రజా పోరాటానికి సిద్ధం అంటూ హెచ్చరించారు. నిరసన తెలుపుతున్న కార్మిక సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పి చంద్రబాబు మోడీ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు..? మేము చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు.
- Advertisement -




