- Advertisement -
కేంద్ర ఉక్కు మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్
Union Steel Minister H.D. Visakha MP Sribharat who met Kumaraswamy
న్యూఢిల్లీ
విశాఖ ఎంపి శ్రీభరత్ గురువారం నాడు కేంద్ర ఉక్కు మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసారు. విశాఖ ఉక్కు పరిరక్షణపై మంత్రి తో కలిసి కీలక చర్చలు జరిపారు. ఉద్యోగుల వేతనాల సమస్య ను మంత్రి దృష్టి కి తీసుకువెళ్లారు. రెండు నెలల వేతనాలు అందక ఉద్యోగులు పడుతున్న సమస్యలను మంత్రికి వివరించారు ఎంపీ. తొందర్లోనే స్టీల్ ప్లాంట్ లో అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
స్టీల్ ప్లాంట్ ను ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని కుడా మంత్రి హామీ ఇచ్చారు. రెండో ఫర్నేస్ ప్రారంభించడానికి కృషి చేసిన మంత్రిత్వ శాఖ కు ఎంపి అభినందనలు తెలిపారు.
- Advertisement -



