Sunday, September 8, 2024

అకాల వర్షాలు వస్తున్నాయి,   రైతులు జాగ్రత్తలు పాటించాలి

- Advertisement -

అకాల వర్షాలు వస్తున్నాయి,  
రైతులు జాగ్రత్తలు పాటించాలి
అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

జయశంకర్ భూపాలపల్లి,

యాసంగి ధాన్యం విక్రయాల్లో రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని  అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం చిట్యాల మండలంలోని అందుకుతండా, గిద ముత్తారం గ్రామాలలోని  ధాన్యం కొనుగోలు కేంద్రాలను  తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అకాల వర్షాలు వస్తున్నాయని రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కొనుగోలు చేసిన  ధాన్యం అకాల వర్షాలకు తడవకుండా తగు  చర్యలు చేపట్టాలని కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు.  కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన మిల్లులకు తరలించాలన్నారు.  రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు దాన్యం విక్రయించొద్దని,
రైతులు పండించిన పంటకు మద్దతు ధర చెల్లించడానికి జిల్లాలో 189 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఏ గ్రేడ్ రకం ధాన్యానికి  2203 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2183 రూపాయలు మద్దతు ధర కల్పించినట్లు తెలిపారు. నిర్ణయించిన  కనీస మద్దుతు దరకంటే తక్కువకు విక్రయించొద్దని,  ఎవరైనా తక్కువ ధరకు కొలుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
రైతులు ఒకేసారి మూకుమ్మడిగా ధాన్యాన్ని మార్కెట్ తీసుకురాకుండా దశల వారిగా వ్యవసాయ అధికారులు సూచించిన తేదీల్లో కొనుగోలు కేంద్రాలను తీసుకురావాలని రైతులకు సూచించారు.   రైతులు ధాన్యం విక్రయాలకు కొనుగోలు కేంద్రాలకు తెచ్చినపుడు వ్యవసాయ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాసు పుస్తకం మొదటి రెండు పేజీలు, ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ పత్రాలను వెంట తెచ్చుకోవాలని ఆయన  తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్