- Advertisement -
విశాఖలో రోడ్డెక్కిన వైకాపా నేతలు
Vaikapa leaders hit the road in Visakhapatnam
విశాఖపట్నం
ఏపీలో వైసీపీ పోరు బాట పట్టింది.ఎన్నికల సమయంలో కరెంటు చార్జీలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆర్నెల్లలోనే 15,485.36 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన సీఎం చంద్రబాబు సర్కారుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా ఆందోళన చేపట్టారు.దీంట్లో భాగంగా విశాఖలో మాజీ మంత్రి అమర్ తో పాటు వైసీపీ నేతలు రోడెక్కి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.ఎన్నికలకు ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు కోట్ల రూపాయలకు పైగా భారాన్ని పేదలపై మోపారని అన్నారు.బాబు షూరిటీ బాదుడి గ్యారెంటీ అనే తరహాలో చంద్రబాబు పాలన ఉందని చెప్పారు.
- Advertisement -