Tuesday, January 14, 2025

తిరుపతి, తిరుమలలో జనవరి 9 న ఉదయం  5 గంటలకు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ

- Advertisement -

తిరుపతి, తిరుమలలో జనవరి 9 న ఉదయం  5 గంటలకు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ

Vaikuntha Dwara Darshan free tickets at Tirupati & Tirumala on January 9 at 5 am

 టిటిడి ఈవో
తిరుపతి
జనవరి 10, 11, 12 తేదీలకు 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్లు

– ⁠ఈ టోకెన్లు జనవరి 9 వ తేదీన ఉదయం 5 గంటలకు  జారీ.

– మూడు రోజుల తర్వాత ఏరోజుకారోజు ముందు రోజు జారీ
– టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదు

•⁠  ⁠తిరుప‌తిలోని 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న కౌంట‌ర్ల‌ను త‌నిఖీ చేసిన టిటిడి ఈవో, అదనపు ఈవో

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో  జనవరి 10 నుండి 19వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి  తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ఈవో  శ్యామలరావు వెల్లడించారు.

జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి  1.20 లక్షల టోకెన్లు చేస్తామని, తదుపరి రోజులకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.

తిరుప‌తిలోని  రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, మునిసిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణునివాసం,  బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎం.ఆర్. పల్లి స్కూల్ లతో పాటు తిరుమలలో బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో  తిరుమల స్థానికుల కొరకు కౌంట‌ర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి  టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్ లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు.

కౌంట‌ర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్ర‌త్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భ‌క్తుల‌కు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివ‌రించారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి   తిరుమ‌ల‌కు వ‌చ్చి స్వామివారి దర్శించుకోవాలని విజ్ఞప్తి.

తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టిటిడి అదనపు ఈవో  వెంకయ్య చౌదరి, టిటిడి జేఈవో  గౌతమి, జిల్లా కలెక్టర్  ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ  ఎల్. సుబ్బరాయుడు,  సివిఎస్వో  శ్రీధర్ లతో కలిసి ఈవో తనిఖీ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్