Sunday, September 8, 2024

పురోగతి ప్రస్థానంలో సికింద్రాబాద్ ను నడిపాము

- Advertisement -

డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, అక్టోబర్ 28(వాయిస్ టుడే ప్రతినిధి): సికింద్రాబాద్ నియోజకవర్గం లోని తార్నాక డివిజన్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ శనివారం ఇసుక బావి, వినోభానగర్, నఫీజ్ గార్డెన్స్, అర్యనగర్, లక్ష్మి నగర్, లాలాపేట ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 సంవత్సరాల్లో చేపట్టని పనులను తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పూర్తి చేశామని, గత పాలకులు పట్టించుకొనే సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పరిష్కరించామని పద్మారావు గౌడ్ అన్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. వివిధ బస్తీలు, కాలనీల్లో పెద్ద సంఖ్యలో స్థానికులు పద్మారావు గౌడ్ కు మద్దతు తెలిపి సత్కరించారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి తో పాటు కార్పొరేటర్లు రాసురి సునీత రమేష్, సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, కంది శైలజ, బీఆర్ ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్, బీఆర్ ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి, నేతలు కంది నారాయణ, కరాటే రాజు, లింగాని శ్రీనివాస్, తార్నాక డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రచారంలో పద్మారావు గౌడ్ కోడళ్ళు కూడా ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను వారు ప్రేమగా పలకరిస్తూ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయ్యాలని అభ్యర్ధిస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్