బండి సంజయ్
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్, షాపూర్ లోని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇంటికి బిజెపి జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ చేరుకున్నారు. బుధవారం ఓ చానెల్ టిబెట్ లో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే వివేకానంద, శ్రీశైలం గౌడ్ పై దాడిని అయన ఖండించారు. కూన శ్రీశైలంను పరామర్శించి దాడి వివరాలను అడిగి తెలుసుకున్న బండి తరువాత మీడియాతో మాట్లాడారు. అంబేత్కర్ రాజ్యాంగం కావాలా లేక కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా. శ్రీశైలంపై దాడిని ఎన్నికల కమీషన్ దృష్టికి తీసికెల్తాం..ఆయనను అనర్హుడుగా ప్రకటించాలని కోరుతాం. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణ వేగంగా మారుతున్నాయి. మీడియా పార్టీలు వారిగా విడిపోయింది. ప్రజలు మాత్రం బిజెపి పార్టీ పక్షాన ఉన్నారు. పేరు వివేకానంద – బుద్దులు మాత్రం ఔరంగజేబ్. సర్వేలన్ని బిజెపి అనుకూలంగా ఉన్నాయి. ప్రశ్నిస్తే దాడులా, శ్రీశైలం పై దాడి ప్రజలపై దాడి. అక్రమంగా సంపాదించిన డబ్బులు వెదజల్లి గెలుస్తా అనే అహంకారంతో సంస్కారహీనంగా వివేక్ ప్రవర్తన ఉంది. ఎలాంటి దాడులైన పేదప్రజల కోసం బిజెపి భరిస్తుంది. ప్రజల సమస్యల కోసం ప్రశ్నించిన వారిపై దాడులు చేసే బీఆర్ఎస్ నాయకులు మనకు అవసరమా. కండకావరంతో దాడి చేసిన ఎమ్మెల్యే వివేకా గుండా అవసరమా.. కబ్జాలు చేసే వారిని బహిస్కరించాలిని అన్నారు. కుత్బుల్లాపూర్ ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. నిన్న జరిగిన సంఘటనలో తప్పతాగి వచ్చి గొడవలు కారణమైన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండు చేసారు.



