‘పట్నం’లో బీజేపీ జెండా ఎగుర వేస్తాం: ఇబ్రహీంపట్నం బీజేపీ అభ్యర్థి అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్
దయానంద్ గౌడ్ కు అడుగడుగునా మహిళల మంగళ హారతులు
ఎల్బీనగర్, వనస్థలిపురం, వాయిస్ టుడే:
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిజెపి అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లినా బిజెపి అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ కు మహిళలు మంగళ హారతులతో స్వాగతాలు పలుకుతున్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ ను అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు పేర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా బిజెపి అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దేశంలో ప్రధాని నరేంద్రమోడీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బిజెపికి పట్టం కడతామని ప్రజలు స్వయంగా చెప్పడం సంతోషంగా ఉందని నోముల దయానంద్ గౌడ్ అన్నారు. ఇబ్రహీంపట్నం గడ్డపై బిజెపి జెండాను ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బిజెపి అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో బిజెపి సర్కారు ఏర్పడేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



