అయోధ్య నుండి మన ఇంటికి వచ్చిన అక్షితలను ఏం చేయాలి….??

- Advertisement -
Ayodhya is heavily armed
What should we do with Akshits who came to our house from Ayodhya…??

అక్షతలు ఇంటికి ఇచ్చిన తర్వాత వాటిని వృద్ది చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు.

(వృద్ధి చేసుకోవడం అంటే.. మన ఇంట్లోని కొన్ని బియ్యం, నెయ్యి, పసుపుతో తయారు చేసుకొన్న అక్షతలకు అయోధ్య నుండి వచ్చిన వాటిని కలపడమే.)

వృద్ధి చేసుకున్న అక్షతల వినియోగము ఎలా చేసుకోవచ్చు ?

22 జనవరి 2024 రోజున అయోధ్య లో శ్రీ బాల రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగతున్న సమయంలో ఇంటిల్లిపాదీ, ఇళ్లు కడుక్కోవడం, స్నానాలు ముగించుకొని,..
గ్రామంలోని దేవాలయానికి అందరూ చేరుకుని.. పూజలు ముగించుకొని, ఇంటికి వచ్చి

1.వ్యక్తిగతంగా నెత్తిన ధరించడం/ ఇంటి యజమాని కుటుంబ సభ్యులను ఆశీర్వదించటం

2. పిల్లలను, చిన్నవారిని దీవించడం,

3. భర్త ఆశీస్సులు దీవెనలు తీసుకోవడం

4. ఒక వస్త్రంలో కట్టి బీరువాలో పెట్టుకోవడం (లక్ష్మీ స్థానం)

5. పిల్లల పుట్టిన రోజున, పెళ్ళి ఇతర శుభకార్యాలలో ఈ అక్షింతలతో దీవించడం

6. ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు వినియోగించడం (పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యాలు, ఉద్యోగ ప్రమోషన్లు…)

7. పెళ్ళిలో తలంబ్రాలతో పాటు కలుపుకోవడం

జనవరి 22న – ప్రాణ ప్రతిష్ఠ రోజున చేయాల్సిన పనులు వివరించాలి.

జనవరి 22 న సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత (రాత్రి) తమ ఇంటి ముందు కనీసం 5 దీపాలు🪔🪔🪔🪔 వెలిగించాలి

వీలయితే ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించి, టపాసులు కాల్చి,, దీపావళిలా జరుపుకోవాలి…..

🚩🚩జై శ్రీరామ్ 🚩🚩

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular