Friday, May 16, 2025

పిఠాపురం నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడిందంటే.

- Advertisement -

పిఠాపురం నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడిందంటే.

తొలి ఎమ్మెల్యే రావు జగ్గారావు

మొదటి మహిళా ఎమ్మెల్యే వంగా గీత

దేశ స్వాతంత్య్రం తర్వత 1952లో పిఠాపురం నియోజకవర్గం ఏర్పడింది. ఇందులో పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి, గొల్లప్రోలు ప్రాంతాలు కలిపి పిఠాపురం మండలంగానే ఉండేవి. తర్వాత పలు సందర్భాల్లో పునర్విభజనలు జరిగి కొన్ని గ్రామాలు రావడమూ, పోవడమూ జరిగాయి.

1952లో రైతుకూలీ ఉద్యమ నాయకులు రావు జగ్గారావు 6,504 ఓట్ల ఆధిక్యంతో భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా గెలుపొందారు. ఆయన తర్వాత ప్రజాపార్టీ తరుపున వాడ్రేవు గోపాలకృష్ణ శాసనసభ్యుడయ్యారు.కాగా పురుషులే శాసనసభ్యులవుతున్న పిఠాపురంలో వంగా గీతా విశ్వనాథ్ ప్రజారాజ్యం పార్టీ తరుపున తొలి మహిళా ఎమ్మెల్యే అయ్యారు.

పిఠాపురం ఓటర్లు చిత్రమైనవారు.విభిన్నమైన తీర్పును ఇస్తుంటారు. రాష్ట్రంలో అంతా ఒక పార్టీ గెలిస్తే,యిక్కడ మాత్రం ప్రతిపక్ష పార్టీయో,అంత ప్రాముఖ్యత లేని పార్టీయో గెలవడం తమాషాగా అనిపిస్తుంది.(అయితే 2019 ఎన్నికల్లో ఈ నానుడికి బ్రేక్ పడింది.) ఓటర్ల నాడి పట్టుకోవడం కష్టమైన పనిగా రాజకీయ పండితులు భావిస్తారు.పట్టణం అభివృద్ధి చెందకపోవడానికి ఇది కూడా కారణమని విశ్లేషకులు భవిస్తుంటారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్