Friday, October 18, 2024

మీకు ఓటు ఎందుకు వేయాలి… రేణుకా ప్రశ్న

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 30, (వాయిస్ టుడే): నీకు ఎందుకు ఓటు వేయాలి అని సీఎం కేసీఆర్ కి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సవాల్ విసిరారు. తెలంగాణలో మహిళలకు రక్షణ ఉందా?.. అత్యాచారం చేసిన వాళ్ళకు అధికార పార్టీ నేతలు అండగా ఉన్నారు.. బాల్య వివాహాలు జరుగుతుంటే ఏం చేస్తోంది ఈ ప్రభుత్వం.. కేజీ టూ పీజీ అని గొప్పలు చెప్పారు కేసీఆర్.. 42 శాతం మహిళలు ఇప్పటికి వేలిముద్రలే వేస్తున్నారు.. ఇది సిగ్గుచేటు కాదా కేటీఆర్.. హైటెక్కుల గురించి మాట్లాడే కేటీఆర్.. మహిళ అక్షరాస్యతపై ఏం టెక్కులు చూపిస్తారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో కవిత ఒక్కతే బాగుపడింది అని రేణుకా చౌదరి మండిపడింది. కవిత తప్పా, మిగిలిన ఆడవాళ్లు అభివృద్దే లేదు.. మహిళలకు మొదట మంత్రి పదవే ఇవ్వలేదు కేసీఆర్.. కేసీఆర్ ప్రభుత్వం యూజ్ లేస్ ప్రభుత్వం.. బంగారు తెలంగాణ అని కేసీఆర్ చెప్పారు.. బంగారం లేదు.. అప్పులే మిగిలాయి అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర రైతులకు డబ్బులు ఇచ్చాడు.. కానీ, తెలంగాణలోమహిళా రైతులకు ఏం ఇచ్చావు అని ప్రశ్నించారు. మహిళలకు మేము ఇచ్చిన పావలా వడ్డీ ఎక్కడ?.. మేము ఇచ్చిన నిత్యావసరాలు బంద్ చేశారు.. మహిళా ఓట్లతోనే కాంగ్రెస్ గెలుస్తోంది అని రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. మా చేతుల గాజులు.. విష్ణు చక్రాలుగా మారిపోతున్నాయి అని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. కేసీఆర్, తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు.. పార్టీ పేరులోనే తెలంగాణ తీసేశారు.. కమ్మ, బీసీలకు సామాజిక న్యాయం సీట్ల విషయంలో దక్కలేదు అంటూ ఆమె మండిపడింది. కానీ, అన్ని కులాల వారికి సాయం చేసే గుణం మాది అని రేణుకా చౌదరి పేర్కొనింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్