అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హతమార్చిన భార్య
నిజామాబాద్
Wife kills husband for standing in the way of her illicit affair.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్ కల్ లో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య, భర్తను హతమార్చింది. గత నెల 30న భర్త ప్రశాంత్ ను భార్య సంధ్య డాబాపై నుంచి తోసేసింది. తీవ్ర గాయాలపైన ప్రశాంత్ ను బంధువులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో టాయిలెట్ క్లీనర్ భర్త ప్రశాంత్ కు సంధ్య ఎక్కించింది. దాంతో పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ప్రశాతం్ మృతిచెందాడు. కోడలిపై అనుమానంతో మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేసారు. దాంతో పోలీసులు తమదైన శైలిలో విచారించి కేసును చేధించారు. భార్యతోపాటు ఆమె ప్రియుడు అతని స్నేహితుడిని అరెస్టు చేసారు.




