Sunday, September 8, 2024

మళ్లీ “బండి” జాతీయ ప్రధాన కార్యదర్శిగా దూకుడు పెంచేనా…!

- Advertisement -
will-bandi-increase-aggression-as-national-general-secretary-again
will-bandi-increase-aggression-as-national-general-secretary-again

హైదరాబాద్, జూలై 29, (వాయిస్ టుడే): తెలంగాణలో అధికారం దక్కించుకోవడం బీజేపీ అనేక వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. బీజేపీ పార్టీకి తెలంగాణలో ఒక ఊపు తెచ్చిన బండి సంజయ్‌ను ఈ బాధ్యతల నుంచి తప్పించడంపై చాలా మంది కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. అయితే బండి సంజయ్‌కు మరో పదవి ఇస్తారని ఇటీవల జోరుగా ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. బీజీపీ జాతీయ నాయకత్వంలోకి బండి సంజయ్‌ను ఆహ్వానించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనకి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కమల అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై బండి సంజయ్ అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలిగా తెలంగాణ నుంచి డీకే అరుణ కొనసాగనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శిగా సత్య కమార్ కొనసాగనున్నట్లు అధిష్ఠానం ప్రకటించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రం నుంచే మరో లీడర్‌ డీకే అరుణకి కూడా జాతీయకార్యవర్గంలో మరోసారి చోటు లభించింది. ఆమెను జాతీయ ఉపాధ్యక్షరాలిగా కొనసాగిస్తున్నారు. ఏపీ నుంచి సత్యకుమార్‌ను ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తున్నారు. ఆయన్ని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా పురందేశ్వరిని అధ్యక్షురాలిగా చేసింది అధినాయకత్వం. అందుకే సత్య కుమార్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా కంటిన్యూ చేశారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా బండి సంజయ్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్