Monday, October 28, 2024

ముదిరాజుల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

- Advertisement -

ముదిరాజుల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

Work to solve the problems of Mudirajas

-మల్కాజ్ గిరి ఎంపీ ఈటల ను కోరిన జిల్లా ముదిరాజ్ యువత అధ్యక్షులు పోతరవేని క్రాంతి

మంథని

ముదిరాజుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మల్కాజ్ గిరి ఎంపీ  ఈటల రాజేందర్ ను పెద్దపెల్లి జిల్లా ముదిరాజ్ యువత అధ్యక్షులు పోతరవేని క్రాంతి కుమార్ ముదిరాజ్ కోరారు.
శుక్రవారం హైదరాబాద్ శామీర్ పేట్  లో ఈటెల రాజేందర్ నివాసంలో ముదిరాజ్ పెద్దపల్లి జిల్లా యువత అధ్యక్షులు పోతరవేని క్రాంతి కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో జరగబోయే బీసీ వర్గీకరణలో ముదిరాజులను బిసి-డి నుంచి బీసీ-ఏ లోకి మార్చే విధంగా ముదిరాజ్ మహాసభ ఏర్పాటు చేసి ఇదివరకు చేసిన తీర్మానాన్ని ముందుకు తీసుకు వెళ్లే విధంగా చూడాలని క్రాంతి కోరారు. ముదిరాజులు ఆర్థికంగా బలోపేతం అయ్యేవిధంగా ప్రయత్నం చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ ను అభ్యర్థించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఈటెల త్వరలో ముదిరాజ్ మహాసభ భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే విధంగా కృషి చేసే రకంగా ప్రతి ఒక్క ముదిరాజ్ యువకుడిని, ముదిరాజ్ సోదర సోదరీమణులను ఏకదాటిపై తీసుకొచ్చి ముందుకు వెళ్దామని హామీ ఇవ్వడం జరిగిందని క్రాంతి తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్