హస్తంలోకి కొనసాగుతున్న వలసలు
హస్తంతోనే దోస్తానంటున్న యువత
నారాయణపూర్ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన యువకులు
వాయిస్ టుడే ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 19: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ముదిరాజ్ యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు. వారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల యువకులు బాగా ఆకర్షితం అవుతున్నారని ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చదువులో కూడా వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక చదువు కూడా భారంగా మారిందన్నారు. అనంతరం యువత మాట్లాడుతూ హస్తంతోనే మా దోస్తాన్ అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, బ్రతుకులు మారతాయని ఈ సందర్భంగా యువకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్,గ్రామ శాఖ అధ్యక్షుడు దొమ్మాటి రాజు,నాయకులు జెల్ల రవి, గణేష్,సురేష్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.