- Advertisement -
భక్తులపై దూసుకెళ్లిన 108 అంబులెన్స్
108 Ambulance hit the devoteesఇద్దరు మృతి …. ముగ్గురికి గాయాలు
తిరుపతి
ఒక అంబులెన్స్ అదుపు తప్పి భక్తులపై దూసుకుపోయింది. ఘటనలొఓ ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి.
చంద్రగిరి మండలం నరశింగాపురం నారాయణ కళాశాల వద్ద ఘటన జరిగింది. మృతి చెందిన వ్యక్తులు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ (40), శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మ (45) గా గుర్తించారు. అంబులెన్స్ లో మదనపల్లి నుంచి తిరుపతి రూయా ఆసుపత్రికి రోగిని తీసుకొస్తున్నారు. బాధిత భక్తులు పుంగనూరు నుంచి తిరుమల కు పాదయాత్ర చేస్తున్నారు.
- Advertisement -




