Sunday, September 8, 2024

చీకటి ఒప్పందాలతో రూ.1200 కోట్ల కుంభకోణం

- Advertisement -

చీకటి ఒప్పందాలతో రూ.1200 కోట్ల కుంభకోణం

1200 crore scam with shady deals

* సమైక్య పాలనలో ఆరోపణలు ఎదుర్కొన్న కాంట్రాక్టర్లకే పెద్దపీట
* చీకటి జీవోలతో సర్కాను నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* కేంద్రం అమృత్ స్కీమ్ లో రూ. 3 వేల కోట్ల కాంట్రాక్టర్ల లో అవినీతి
* సీఎం సొంత జిల్లాలోనే మేఘ కృష్ణా రెడ్డి కి రూ .11 వందల కోట్ల కాంటాక్ట్స్
* మేఘ తో తెలంగాణ సొమ్ము కక్కిస్తాను అని చెప్పిన రేవంత్ రెడ్డి
* మళ్లీ మేఘా కే కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుకున్న్న మతలబు ఏమిటి?
* మేఘ కృష్ణ రెడ్డి కి మీకున్న సంబంధం ఎంటి?
* నిధుల్లో జరిగిన అవినీతి పై  ఈడి,సిబిఐ ఎంక్వైరీ చేపట్టాలి
* బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ జూలై 11
రాష్ట్ర ప్రభుత్వం జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా చీకటి ఒప్పందాలతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గురువారం శాసనసభ ఆవరణలో మీడియా సమావేశం  లో మాట్లాడుతూ  లో  రహస్య జీవోలతో సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మేఘా కృష్ణారెడ్డికి రూ.1100 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన  డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకొని జీవోలు తెచ్చి బలవంతపు వసూళ్లు చేస్తుందని అన్నారు. కేంద్రం నుంచి అమృత్ స్కీమ్ లో రూ. 3 వేల కోట్ల కాంట్రాక్టర్ల లో అవినీతి కి పాల్పడ్డారని ఆరోపించారు. దీన్ని మూడుగా డివైడ్ చేసి వెయ్యి కోట్లకు ఒక్కరిగా కాంట్రాక్టు ఇచ్చారన్నారు.. మేఘా కృష్ణారెడ్డికి రూ. 11 వందల కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చారని తెలిపారు.ఎక్సైజ్ కుంభకోణంలో ఉన్న రేవంత్ బామ్మర్ది సృజన్ అనే వ్యక్తీ కి చెందిన శోధ కంపెనీకి రూ. 400 వందల కోట్ల కాంట్రాక్టర్ ఇచ్చారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రూ. 600 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్ట్ ను వెయ్యి కోట్లకు ఇచ్చినట్లు చెప్పారు. 30 నుంచి 35 శాతం తక్కువకు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సిద్దంగా ఉన్నారని తెలిపారు. అంటే ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్ పొంచి కాంటాక్ట్స్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. మొత్తం కలిపి రూ.1200 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఏ ఒక్క జీవో ను కూడా ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదని ప్రశ్నించారు.మేఘా కృష్ణారెడ్డి మీద కాళేశ్వరం ఎంక్వైరీ రుగుతుంది కదా? ఆయన మీద జ్యుడీషియల్ ఎంక్వైరీ నడుస్తుందని అన్నారు.అలాంటప్పుడు  ఆయన కంపెనీ నీ బ్లాక్ చేయకుండా కాంట్రాక్టు ఎలా ఇచ్చారు? అని మండిపడ్డారుమేఘా కృష్ణారెడ్డితో తెలంగాణ సొమ్ము కక్కిస్తాను చెప్పిన రేవంత్ రెడ్డి… మళ్ళీ ఆయనకు కాంట్రాక్ట్ ఇవ్వడం వెనకున్న మతలబు ఏమిటి? అని అనుమానం వ్యక్తం చేశారు.మేఘా కృష్ణారెడ్డికి మీకున్న సంబంధం ఏంటని ప్రశ్నించారు.ఇక కరీంనగర్ లో సీఎం తమ్ముడు పార్టనర్ అని చెప్తున్నారని చెప్పారు. రాబోయే కొడంగల్ టెండర్లలో కూడా మేఘా కు పెద్ద పీట వెయ్యబోతున్నారని అన్నారు. దీనికి ఎస్టిమేట్ ప్రయివేట్ ఇంజనీర్లు తో వేయించుకుంటున్నారని తెలిపారు. తాను అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.నిధుల్లో జరిగిన అవినీతి పై  ఈడి,సిబిఐ ఎంక్వైరీ కొరతామని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్