ఘనంగా స్వామి వివేకానంద 123 వ వర్ధంతి
రామడుగు
రామడుగు మండలం వెదిర ఎక్స్ రోడ్ వద్ద స్వామి వివేకానంద 123 వ వర్ధంతిని పురస్కరించుకొని జాతీయ యువజన అవార్డు గ్రహీత అలవాల విష్ణు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి ప్రజాప్రతినిధులు అధికారులు యువకులు ప్రజలు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ యువజన అవార్డు గ్రహీతలు కళింగ శేఖర్ అలవాల విష్ణు మాట్లాడుతూ యువత సన్మార్గంలో ప్రయాణించాలని కోరారు. యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించుట కొరకు సాధన చేయాలని వారన్నారు. స్వామి వివేకానందుడు కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే బ్రతికిన ఆయనను నేడు మనం కూడా ఆదర్శంగా తీసుకుంటున్నామంటే కారణం ఆయన యొక్క దర్శని కథనే ముఖ్య కారణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణకు నూతన యువజన విధానాన్ని ప్రకటించి యువజన సంఘాల బలోపేతానికి కృషి చేస్తూ స్వామి వివేకానంద జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రేండ్ల కళింగ శేఖర్ అలువాల విష్ణు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గౌరీ రమేష్ నాయకులు టి అనిల్ కుమార్ నేరెళ్ల ఆంజనేయులు గౌడ్ నాగుల రాజశేఖర్ గౌడ్ లేఖ రాజు యువజన సంఘాల నాయకులు అమీర్ శెట్టి భూమిరెడ్డి గజ్జల అశోక్ కొలిపాక కమలాకర్ పన్యాల అశోక్ రెడ్డి ముదిగంటి ఆనంద్ రెడ్డి నేరెళ్ల మారుతి గౌడ్ అంజన్ కుమార్ అలవాల శంకర్ అనిల్ కుమార్ కే రాజు బి రెడ్డి కర్ణాకర్ రెడ్డి నవీన్ మహేష్ రాజ్ కుమార్ కొలిపాక ప్రవీణ్ కుమార్ సాయి ప్రసాద్ హర్షవర్ధన్ ప్రశాంత్ మధు రామ్ చరణ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా స్వామి వివేకానంద 123 వ వర్ధంతి

- Advertisement -
- Advertisement -