- Advertisement -
గ్యాంగ్టక్: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఉత్తర సిక్కింలో కురిసిన కుండపోత వర్షానికి లాచెన్ లోయలో గల తీస్తా నది ఉప్పొంగడంతో ఈ వరదలు చోటుచేసుకున్నాయి.. ఇందులో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. కొన్ని వాహనాలు కూడా నీటమునిగాయి. ఆర్మీ సిబ్బంది కోసం భారీఎత్తున గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
![23 army personnel missing in Sikkim](https://voicetodaynews.com/wp-content/uploads/2023/10/floods.jpg)