- Advertisement -
ఇందిరమ్మ ఇంటి సర్వేలో 35 ప్రశ్నలు
35 questions in Indiramma's house survey
నల్గోండ, డిసెంబర్ 14, (వాయిస్ టుడే)
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలు కోసం ‘యాప్’ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. ప్రతి అంశాన్ని యాప్ లో నమోదు చేస్తున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి… లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవలే ప్రత్యేక మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. అన్ని జిల్లాల్లోనూ యాప్ ద్వారా అధికారులు వివరాలను సేకరిస్తున్నారుప్రజాపాలనలో పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ప్రతి దరఖాస్తును క్లుప్తంగా పరిశీలించి… వివరాలను సేకరిస్తున్నారు. యాప్ లో నమోదు చేసే వివరాల ఆధారంగా… దరఖాస్తుదారుడు అర్హులా? కాదా? అనేది వెల్లడవుతుంది.గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ది పొందారా?, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం ఎలా ఉంది వంటి వివరాలను యాప్ లో సేకరిస్తున్నారు. ఇళ్లు నిర్మించుకోవడానికి భూమి అందుబాటులో ఉందా? లేదా?, స్థలం లబ్దిదారుడి పేరు మీద ఉందా? కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా?, ఇంట్లో వివాహిత జంటల సంఖ్య, ప్రస్తుత గ్రామం/పట్టణంలో ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. లబ్దిదారులు వికలాంగులు/అనాథలు/ ఒంటరి మహిళలు/వితంతువులు/ ట్రాన్సో జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఉంటే ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిని కూడా యాప్ ద్వారానే గుర్తిస్తారు, అన్ని కలిపి 30 – 35 ప్రశ్నలు ఉంటాయి. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు ఆయా వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు.మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను కేటాయిస్తారు. మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను ధపాలు వారీగా ఇస్తారు.
దరఖాస్తు ఇలా చేసుకోవాలి
రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కూసుమంచిలో మాట్లాడిన ఆయన… పేదవారు కన్న కల ఇందిరమ్మ ఇల్లు అని చెప్పుకొచ్చారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులు వెళ్లి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారని గుర్తు చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అభ్యర్ధించారని తెలిపారు. ఎవరైతే సొంత స్థలంలో ఉంటారో వారి ఇంటి ఫోటో తీసి యాప్ లో నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తామన్న ఆయన… రాష్ట్ర వ్యాప్తంగా 580 మోడల్ హౌజ్ లను నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. సంక్రాంతి నాటికి కూసుమంచి లో మోడల్ హౌజ్ నిర్మాణం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు.గత ప్రభుత్వం లో కాంట్రాక్టర్లకు ఇళ్లు ఇస్తే కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఎవరు ఇళ్లు వారే నిర్మించుకునే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజాపాలన లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తిస్తున్నారని వివరించారు. ప్రజాపాలన లో దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసిన వారి కుటుంబ సభ్యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.ఇందిరమ్మ ప్రభుత్వం లో కండీషన్ లు పెట్టి ఇళ్లు ఇవ్వకుండా తప్పించుకునే ప్రభుత్వం కాదని మంత్రి స్పష్టం చేశారు. పేదవారికి భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. గ్రామాలకు సర్వేకు వచ్చే అధికారులు ఇందిరమ్మ కమిటీలను కలుపుకుని పోవాలని పిలుపునిచ్చారు. పేదవారి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. దరఖాస్తుదారుల వివరాలను ఎంట్రీ చేసి… లబ్ధిదారులను గుర్తిస్తారు. యాప్ అందుబాటులోకి రావటంతో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రక్రియ వేగవంతం కానుంది.ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. ఆయా దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి సర్వేయర్లు యాప్ లో వివరాలను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ మొదలైంది. దరఖాస్తుదారుడి అన్ని వివరాలను సేకరిస్తారు. గతంలో ఏదైనా ఇంటి స్కీమ్ లో లబ్ధి పొందారా..? ఎలాంటి వాహనాలు ఉన్నాయి..? స్థలం ఎవరి పేరుపై ఉంది..? కుటుంబంలో ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారా..? ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లింపుతో పాటు ఇతర వివరాలను తీసుకుంటారు. దరఖాస్తుదారుడు ఇచ్చే సమాచాన్ని యాప్ లో నమోదు చేసిన తర్వాత అన్ని కోణాల్లో క్రోడీకరిస్తారు. ఇందులో ఏఐ టెక్నాలజీ కీలకంగా పని చేయనుంది. అన్నింటిని పరిశీలించిన తర్వాతే… అసలైన నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తారు.
- Advertisement -