Breaking News
Saturday, July 27, 2024
Breaking News

వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయాల్సిందే

- Advertisement -

వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయాల్సిందే
ఎంపి బండి సంజయ్
హుజూరాబాద్
జమ్మికుంట మండలం శాయంపేటలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
ప్రజాహిత యాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. ఎక్కడికి వెళ్లినా మోదీకే ఓటేస్తామని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 350కిపైగా ఎంపీ సీట్లు వస్తాయి. తెలంగాణలో 17కు 17 ఎంపీ సీట్లు గెలుచుకుంటామనే నమ్మకం ఉంది. ఈనెల 4, 5 తేదీల్లో ప్రధానమంత్రి సభలో పాల్గొనేందుకు వెళుతున్నా. ఈనెల 8, 9 తేదీల్లో శివరాత్రి సందర్భంగా ప్రజాహిత యాత్రకు విరామం. ఇచ్చిన మాట మేరకు వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నా…రూ.500లకు గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులో కోత పెడుతున్నరు. 90 లక్షల రేషన్ కార్డు కుటుంబాలుంటే… 50 లక్షల కుటుంబాలకు కోత పెట్టడం అన్యాయమని అన్నారు. ప్రతినెలా ఉద్యోగులకు జీతాలివ్వకుంటే వాళ్లతో కలిసి సర్కార్ ను నిలదీస్తూనే ఉంటాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కై దొంగాట ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నయ్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కాగ్, విజిలెన్స్ సంస్థలు తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?   అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ సైతం 6 గ్యారంటీల హామీల అమలు కోసం నిలదీయలేకపోతోంది. హైదరాబాద్ నుండి కరీంనగర్, రామగుండం రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం రక్షణ భూములివ్వడం హర్షణీయం. రాజకీయాలను పక్కనపెట్టి అభివ్రుద్ధిపై ద్రుష్టి పెడితే కేంద్రం ఏ విధంగా సహకరిస్తుందే ఇదే నిదర్శనం. గత బీఆర్ఎస్ సర్కార్ కేంద్రాన్ని తిట్టడానికే పరిమితమైందే తప్ప ఏనాడూ అభివ్రుద్ధిపై ద్రుష్టి పెట్టలేదు. ఇకనైనా కేంద్రాన్ని, మోదీని తిట్టడం మానుకుని ప్రజా సమస్యలపై ద్రుష్టి పెట్టాలి. గత ప్రభుత్వం మాదిరిగా కాంగ్రెస్ ఆరోపణలకే పరిమితమైతే తెలంగాణ ప్రజలు నష్టపోతారు. తెలంగాణ అభివ్రుద్దికి కేంద్రం పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉంది. 10 ఏళ్లలో తెలంగాణలో దాదాపు రూ.10 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చింది. కేంద్రంలో మోదీని మళ్లీ ప్రధానిని చేస్తే శక్తివంతమైన భారత్ రూపుదిద్దుకుంటుంది. భూదాన్ భూముల పేరుతో బోయినిపల్లి వినోద్ కుమార్ కుటుంబ అక్రమాలు నిజమని అన్నారు.
గతంలో నేను ఈ అంశంపై ఆరోపణలు చేసిన మాట నిజం. ఆంధ్రజ్యోతి కథనంపై విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. విచారణ పేరుతో కాంగ్రెస్ జాప్యం చేస్తూ 6 గ్యారంటీల అమలు అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!