-

Crores of money are wasted by hoping for a low rate ఉద్యోగాల పేరిట రూ.20 కోట్ల టోకరా.. వలపన్ని కేటుగాడిని అరెస్టు చేసిన సిరిసిల్ల పోలీసులు
- సినిమా టైటిల్ పేర్లకు మించి పోయేలా బ్లఫ్ మాస్టర్ సినిమా చూపెట్టిన ఇతడు చేసిన మోసాలకు పోలీసులే షాక్ అయ్యారు.
- ఇంతకీ ఎవరా మోసగాడు?
- అంటే సినిమా రేంజ్ లో ఉండేలా ఉంటది. ఏమిటా కథ అనుకుంటున్నారా?
- ఆన్లైన్లో వస్తువులు తక్కువ రేటుకు అంటూ ఆశచూపి లక్షలు, కోట్ల డబ్బు హాంఫట్ చేశాడు.
- పోలీసులకు చిక్కడం మళ్ళీ అదే దందా మొదలెట్టడం అదే అతని తంతు.
- తాజాగా ఇతగాడి కళాపోషణను సిరిసిల్ల పోలీసులు బయటపెట్టారు.
- వివరాల్లోకెళ్తే..
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని ధర్మారంకు చెందిన రమేష్ చారి హైదరాబాద్ కేంద్రంగా ఓ ముఠాను ఏర్పాటు చేసి మోసాన్ని అవలీలగా చేయడం రమేష్ నైజం. అధికార పార్టీ నాయకులతో ఫోటోలు దిగడం వాటిని అమాయకులైన వారికి చూపెట్టి మోసం చేయడంలో దిట్ట. ఏకంగా సీఎం కేసీఆర్ పేరును వాడుతూ, కేసీఆర్ సేవాదళం అనే సంస్థ ఏర్పాటు చేసి కర్త, క్రియ నేను అంటూ ప్రగల్బాలు చెబుతూ, పరిచయస్తులను తన ముగ్గులోకి దింపడం ఇతని నైజం.
ఇతగాడి సూటు, బూటు, కల్పిత మాటలు చూసి కొందరు అమాయకులు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మి లక్షలు ఇవ్వగా, వారందరికీ కుచ్చుటోపీ. అసహించుకునెలా తన మాటల గారడీతో ఇదిగో ప్రభుత్వ ఉద్యోగం అంటూ… చెబుతూ… నమ్మబలికేవాడు. ఇది బయట పడిన కొన్ని రోజులకు ఆన్లైన్ లో వస్తువులు తక్కువ రేటు అని పెట్టి ఆశపడి కొనుక్కునే వారి దగ్గరికి కొందరికి పంపించి నమ్మిస్తాడు. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో అర్దర్లు రాగానే జెండా ఎత్తేయడం, ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఈ మోసగానికి వెన్నెతో పెట్టిన విధ్య.



