
హైదరాబాద్: జూలై 29: వరుణుడు శాంతించాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్త తెరిపిచ్చాయి. ఎట్టకేలకు శనివారం సూర్యుడు కనిపించాడు. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం ఏర్పడినట్టు వెల్లడించింది. ఆగస్టు 1వ తేదీన ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ, ఆగస్టు 2న కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వివరించింది.
గడిచిన 24 గంటల్లో స్వల్ప వర్షపాతం
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వానలు పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలో 22.7 మి. మీ, మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో 21.4 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 17.1 మి.మీ.



