- Advertisement -

పరువు నష్టం కేసుతో లోక్సభ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి.. తిరిగి సభ్యత్వం దక్కుతుందా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది..
స్పీకర్ ఓం బిర్లా నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. అయితే రాహుల్ న్యాయపోరాటంతో సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. శిక్ష అమలుపై మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో రాహుల్ గాంధీ సభ్యత్వ పునరుద్ధరణకు లైన్ క్లియర్ అయింది. అయితే సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారా..? మరింత సమయం తీసుకుంటారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.
- Advertisement -



