నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా సెంటర్లలో మాస్ కాపీయింగ్

కర్నూలు : పరీక్షలంటే ఎంతో పకడ్బందీగా కట్టుదిట్టంగా నిర్వహిస్తారు పరీక్ష సెంటర్ లో పెన్ను పేపర్ తప్ప దేనికి అనుమతి ఉండదు. కానీ ఈ దూరవిద్యా విధానం లో ఆయా యూనివర్సిటీలు వాటికి అనుగుణంగా నియమాలు నిర్ణయించుకొని పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే కర్నూలు లో దూరవిద్యా ద్వారా నాగార్జున యూనివర్సిటీ వారు డిగ్రీ మరియు పీజీ పరీక్షల నిమిత్తం కొన్ని సెంటర్ లు తీసుకొని పరీక్షలలో మాస్ కాపీయింగ్ కొరకు విద్యార్థులతో 2000 నుండి 3000 తీసుకొని పరీక్ష కేంద్రాలలో బుక్కులు పెట్టీ మొబైల్ పెట్టీ ఒకరికి బదులు మరొకరిని అనుమతించి యదేచ్చగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇన్విజిలేటర్ లు ఫ్లయింగ్ స్వాడ్ లు వచ్చి వారి వారి కోట 50 వేల నుండి లక్ష దాకా సెంటర్ ను బట్టి విద్యార్థుల సంఖ్యను బట్టి వసూళ్లు చేసుకొని పోతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మాస్ కాపీయింగ్ నీ నివారించి స్టడీ సెంటర్స్ అనుమతులు రద్దు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.




