ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాట్ కామెంట్స్..
మాజీ మంత్రి తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించిన మంత్రి అజయ్ కుమార్.. ఓ ఓడిపోయిన వ్యక్తికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ని చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారిది.. నాది గేలిచిన ఖమ్మం ఏ, ఓడిపోయిన ఖమ్మం ఏ, కొందరు అలా కాదు.. ఒక్కసారి ఖమ్మం వైపు చూసి మరోసారి పాలేరు వైపు పోదాం అనే ఆలోచన మాది కాదు.. నేను ఇక్కడ భూమిపుత్రుడిని, మరోసారి ఆశీర్వదించండి.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక్కసారి ఖమ్మంకు మంత్రి పదవి వచ్చినందుకె ఇంత అభివృద్ధి చేసుకున్నాం.. కొందరికి కడుపు నొప్పి వస్తే, అందరికి కడుపు నొప్పి రావాలి అని కొందరు భావిస్తున్నారు.. అది వారి స్వార్ధ రాజకీయాల కోసం బలి పెడదాం అని అనుకుంటే మనం సిద్ధంగా లేము.. సమయానుకూలంగా అందరికి అవకాశాలు రావాలి అని అనుకోవాలి.. కొందరికి ఒక్కసారి అవకాశం ఇస్తే దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారు.. ఖమ్మం అభివృద్ధిలో ముందు ఉంది,దానిని వెనుకకు నెట్టాలి అని కొందరు కలలు కంటున్నారు.. రూమర్స్,గోబెల్ ప్రచారాల ద్వారా మనల్ని ఆగం చేయాలి అని చూస్తున్నారు వారి పట్ల తస్మాత్ జాగ్రత్త.. మంత్రి పువ్వాడ అజయ్ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న పువ్వాడ అజయ్ తండ్రి సిపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు..



