- Advertisement -
ఖమ్మం: ఖమ్మం నియోజకవర్గానికి నిధులు మంజూరయ్యాయి. పది రోజుల క్రితమే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం 690 కోట్లు కేటాయించింది. ఖమ్మం అభివృద్ది కోసం ఇవాళ 100 కోట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేసారు. మంత్రి పదవి చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా మంత్రి కేటీఆర్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం కలిసారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వంద కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. ఖమ్మం అభివృద్ధికి మరింత ఊతమిస్తుంది అంటూ కేటీఆర్ కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -



