- Advertisement -
దుర్గమ్మను దర్శించుకున్న భువనేశ్వరి

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, ఆమె సోదరుడు రామకృష్ణ శనివారం ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించకున్నారు. నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఒక బిడ్డకు మనసు బాలేనప్పుడు తల్లిదండ్రులు వద్దకు వెళతారు. అందుకే నా బాధ చెప్పుకో వడానికే అమ్మవారి దగ్గరకు వచ్చాను. అమ్మవారి ని నేను కోరింది ఒక్కటే నా భర్తను రక్షించమని, ఆయనకి మనోధైర్యం ఇవ్వమని కోరాను. చంద్రబాబు తన పోరాటం కోసం తన కుటుంబం కోసం కాదు ఎపి ప్రజల స్వేచ్చకోసం. చేయి చేయి కలిపి చంద్రబాబు పోరాటం దిగ్విజయం కావాలని కోరుతున్నా. మీరందరూ పోరాటం చేయాలి అది మీ హక్కని అన్నారు.
- Advertisement -



