హైదరాబాద్: యూత్ ఫోర్స్ కన్వీనర్ లను సన్మానించిన కొత్త లక్ష్మణ్ పటేల్ మరియు సీనియర్ జర్నలిస్టు చందు జనార్ధన్, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన కోర్ కమిటీ మరియు రాష్ట్ర విభాగాల కన్వీనర్ ల సమావేశం నిర్వహించారు. ఇటివలే నరేన్ గార్డెన్స్, సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ నిర్వహించారు. రాష్ట్ర కన్వీనర్ , కోర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మన మున్నూరు కాపు యువత ఒకరికి ఒకరు సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పటేల్ యూత్ ఫోర్స్ స్థాపించి అనూహ్య కాలంలో పటేల్ యూత్ ఫోర్స్ కన్వీనర్ ల సహకారం తో ముందుకు దూసుకు పోతుంది. యూత్ ఫోర్స్ మరింత బలపడలని వివిధ రంగాల్లో వారికి కన్వీనర్ లుగా నియమించరు. రాష్ట్ర ఫిల్మ్ ఇండస్ట్రీ మరియు ఎంటర్టైన్మెంట్ ఇంచార్జీ భాద్యతలు డైరెక్టర్ సూర్య తేజ మరియు సోషల్ మీడియా ఇంచార్జీ కొత్తూరు రాజేందర్ ను నియమించారు. అలాగే అమెరికన్ ఫుట్బాల్ అండ్ అట్లాంటిక్ నేషనల్ ప్లేయర్ గా పేరు ఉన్న జంగేటి.నిఖిల్ ని పటేల్ యూత్ ఫోర్స్ క్రీడా విభాగం ఇంచార్జీ గా బాధ్యతలు ఇచ్చారు.త్వరలో పెద్ద ఎత్తున హైదరాబద్ లో జరగబోయే మీటింగ్ త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.అనంతరం ముఖ్య అతిథిలు గా హాజరైన వాయిస్ టుడే చానెల్ యం.ఢి లక్ష్మణ్ పటేల్ మరియు సీనియర్ జర్నలిస్టు చందు జనార్ధన్ మాట్లాడుతూ భవిష్యత్తులో పటేల్ యూత్ ఫోర్స్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటు యువత ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు .తమ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని తెలపుతూ ముగించారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరి పేరుక రమేష్ పటేల్, సీనియర్ జర్నలిస్టు దాడే వెంకట్, తిరుమల్ ,రాష్ట్ర కన్వీనర్ లు అఖిల్ పటేల్, అభిషేక్ పటేల్, తెలంగాణ, ఆంధ్ర కో ఆర్డినేటర్ హేమంత్, రాష్ట్ర క్రీడా కన్వీనర్ ప్రముఖ క్రీడా కారుడు సాయి దిపాక్ పటేల్,యూత్ మెడికల్ విభాగం కన్వీనర్ డాక్టర్ అణుదీప్ పటేల్, రాజీవ్ పటేల్,ఐటీ విభాగం కన్వీనర్ మధు , మల్లేశం పటేల్, వివిధ జిల్లాల మరియు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు………




