రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్లు రూపాయలు వేసిన ఘనత కెసిఆర్ కు దక్కింది : కేటీఆర్
గంభీరావుపేట (వాయిస్ టుడే ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పలి అభివృద్ధి పనులకు స్థానిక మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. భారతదేశ చరిత్రలో రైతుల ఖాతాల్లో ఒకేసారి 73 వేల కోట్లు అని అన్నారు. రైతన్నలకు రైతు బీమా లాంటి కార్యక్రమాలను తెలంగాణలో తప్ప ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. గంభీరావుపేట మండలంలోని నాలుగు గ్రామాలకు చెందిన 378 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులకు పట్టాలు అందజేయడం జరిగింది. నర్మాల, కోళ్లమద్ది, లింగన్నపేట, గంభీరావుపేట లకు సంబంధించిన లబ్ధిదారులకు స్టేజి పైకి పిలిచి పట్టాలు అందజేశారు. సీఎం కేసీఆర్ ఒక రైతు ఆని, ఒక రైతుగా ఆలోచించి రైతులకు రైతుబంధు మరియు రైతులకు రైతు బీమా పాలసీ చేయించడమే అందుకు తార్కానమని కేటీఆర్ పేర్కొన్నారు..



